ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి తిరిగి చూడకండి….

‘ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి తిరిగి చూడకండి. తిన్నగా వెళ్లండి సూర్యుడి కిరణంలాగా’

గత కొన్ని దశాబ్దాలుగా ఇదే వాక్యాన్ని పదేపదే వేరేవేరే సందర్భాల్లో చెబ్తూవచ్చిన తీవ్ర స్వరం హీరాలాల్ మోరియాది. నాకు సాహిత్య ఊహలు తెలుస్తూ, అర్థమవుతూ వచ్చిన పదేళ్ళ ప్రాయంనుంచీ ఇప్పటివరకూ మోరియాని అనేక సందర్భాల్లో చూశాను, విన్నాను. మేం అప్పుడు పల్లెనుంచి పట్నానికి వచ్చిన రోజులు. ఒక రోజు సాయంత్రం ఇంటికి తెల్లఖద్దరు బట్టల్లో మంచి మల్లెపువ్వులా ఆయన నడిచివచ్చారు. ఆ సాయంత్రం ఆయనా, నాన్నగారు (కౌముది) ప్రపంచ సాహిత్యాన్నంతా ఆగమేఘాల మీద సందర్శించారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు… భాషల అడ్డుగోడల్లేని సాహిత్య సంభాషణ. ఆ రోజు రాత్రి ఆయన వెళ్ళిపోతూ ‘అఫ్సర్ బేటా’ అని నావైపు తిరిగి పైన చెప్పిన ఒకే ఒక్క పంక్తి చెప్పారు. అదేమాట ఆయన రెండేళ్ళ క్రితం నేను మాడిసన్ నుంచి వచ్చినపుడు (2004) మరోసారి మళ్ళీ చెప్పారు. అది ఆయన్నించి నేను విన్న మొదటి, చివరి మాట కూడా! (ఇంకా…)

ప్రచురితం: on జనవరి 27, 2008 at 1:39 పూర్వాహ్నం  వ్యాఖ్యానించండి  

అసలు ఉద్దేశం అది కానే కాదు…

కవిరాజమూర్తి నవల గురించి నా వ్యాసం ( జూన్ వివిధ)పై జగన్‌రెడ్డి (జూలై 9) రాసిన ఉత్తరం చదివాను. మంచి వివరాలతో, అత్యంత ప్రజా స్వామికమైన స్వరంతో ప్రయోజనకరమైన చర్చకు అవకాశమిచ్చినందుకు జగన్‌కి ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన సమాచారం నాకు మున్ముందు ఈ విషయంలో చేయబోయే పరిశోధనకు చాలా ఉపయోగపడుతుంది. జగన్ అతిముఖ్యమైన విగా భావించిన రెండు విషయాల గురించి నేను కొంత వివరించాల్సి ఉంది. కవిరాజమూర్తి ఉర్దూలో రాయడం నాకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం కాదు. ఉర్దూ సాహిత్యచరిత్ర (తెలంగాణ అని మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగానే) తెలిసిన వారెవరికైనా ‘హిందూ’రచయితలు ఉర్దూలో రాయడం ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాదు. (ఇంకా…)

ప్రచురితం: on జనవరి 17, 2008 at 1:07 అపరాహ్నం  అభిప్రాయములు (1 )  

తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక ‘అపరిచితుడు’

1944తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ కొత్త. పూటకి ఠికానా లేదు. నిలువ నీడలేదు. అతికష్టంమీద కోఠీలో ఒక ఇరుకుగది దొరికింది. ఆ ఇరుకుగది అతని ప్రపంచమయ్యింది. కాదు, ప్రపంచమే అతని ఇరుకుగదిలో ఇమిడిపోయింది. ఎందరో తెలం గాణ యువరచయితలకు అది కేంద్రమయ్యింది. (ఇంకా…)

ప్రచురితం: on జనవరి 16, 2008 at 2:06 అపరాహ్నం  వ్యాఖ్యలు (2)  
Follow

Get every new post delivered to your Inbox.