చరిత్ర భాష అతనికి తెలుసు. సంక్లిష్టమయిన పూర్వ ఆధునిక గతాన్ని అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్టు, వొక మరచిపోలేని కథలాగా చెప్పడం ఆయనకే సొంతమయిన శైలి. ఆయన వచనంలో నిన్నటి చరిత్ర కళ్లకి కట్టినట్టు మన ముందు నిలబడుతుంది. ఆయన పేరు రిచార్డ్ మాక్స్ వెల్ ఈటన్ . ఈ మధ్యనే ఆయన 1300 నుంచి 1761 వరకూ కాలాన్ని తీసుకుని రాసిన దక్కను చరిత్రని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అచ్చు వేసింది. ఇందులో ఆయన మనకు తెలిసిన సర్వాయి పాపడు, ప్రతాప రుద్రుడు, రామరాయలు, మహమూద్ గవాన్ ల వంటి చారిత్రక వ్యక్తుల గురించి మనకి తెలియని చరిత్ర కోణం నుంచి రాశారు.